బోయిన్‌పల్లిలో దారుణం..

Update: 2019-06-23 14:59 GMT

సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. హస్మత్‌పేట్ లో ఓ టిప్పర్‌ బ్రేకులు ఫేయిల్‌ కావడంతో ఆరేళ్ల చిన్నారి మృతిచెందింది. ఎత్తైన ప్రదేశానికి ఎక్కుతుండగా అకస్మాత్తుగా టిప్పర్‌ బ్రేకులు ఫేయిల్‌ అయ్యాయి. దీంతో అది వచ్చిన దారిలోనే వెనక్కు ప్రయాణించింది. దీంతో రోడ్డుపై ఉన్న చిన్నారిపై టిప్పర్‌ వెళ్లింది. వెనకాల ఉన్న టాటా ఏస్‌ బండిని ఆ తర్వాత విద్యుత్‌ స్తంభాన్ని ఢీ కొట్టి టిప్పర్‌ ఆగిపోయింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్‌ డ్రైవర్‌ పరారయ్యాడు. అయితే వాస్తవానికి భారీ లోడ్‌తో కూడిన వాహనాలకు పగటి పూట నగరంలోకి అనుమతి లేకపోయినప్పటికీ కంకర లోడ్‌తో కూడిన టిప్పర్‌ను చిన్న గల్లీలోకి ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఘటన స్థలానికి పెద్ద ఎత్తున చేరుకున్న స్థానికులు ఆందోళన చేపట్టారు. డ్రైవర్‌ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని వారు ఆరోపిస్తున్నారు. నిందితున్ని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.బోయిన్‌పల్లిలో దారుణం.. 

Tags:    

Similar News