సిద్దిపేట జిల్లాలోని అక్కన్నపేటలో గంగరాజుపై సదానందం కాల్పులు జరిపాడు. అయితే సదానందం వాడిన తుపాకులు పోలీసులవేనని ఇంఛార్జ్ సీపీ శ్వేత నిర్ధారించారు. హుస్నాబాద్ పోలీస్స్టేషన్ నుంచి రెండు వెపన్స్ను ఎత్తుకెళ్లాడని స్పష్టం చేశారు.
ఒక ఏకే-47తో పాటు కర్బయిన్ తుపాకులను అపహరించినట్లు ఇంఛార్జ్ సీపీ తెలిపారు. అయితే గంగరాజుపై సదానందం కాల్పులు జరిపినప్పుడే ఈ విషయం బయటపడిందన్నారు. తుపాకులు మిస్సైన విషయంలో అప్పుడు ఉన్న పోలీసులపై విచారణ చేసి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై త్వరలో ఛార్జ్షీట్ వేస్తామన్నారు.