హుజూర్ నగర్ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థిగా పాలెంపల్లి శేఖర్ రావు పోటీ చేయనున్నారని ఆ పార్టీ నేత తమ్మినేని వీరభద్రం తెలిపారు. రేపు ఉదయం తమ పార్టీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేస్తారని వెల్లడించారు. ఉప ఎన్నికల్లో సీపీఎంకు టీజేఎస్, సీపీఐ మద్దతు ఇస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్ల ఫలితం రాష్ట్ర ప్రభుత్వంపై పెద్దగా ప్రభావక చూపకపోయినా..చర్చకు అవకాశం ఉంటుందని తమ్మినేని వీరభద్రం అభిప్రాయపడ్డారు.