తెలంగాణలో సంక్రాంతి తర్వాత విద్యా సంస్థలు ప్రారంభం ?

Update: 2020-12-18 15:04 GMT

తెలంగాణలో సంక్రాంతి పండుగ తరువాత పాఠశాలలు, కళాశాలలు తెరిచేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. మొదట 9, 10 తరగతులు, తరువాత జూనియర్‌ కాలేజీలు ప్రారంభం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ లో విద్యాశాఖ తీసుకువచ్చిన ప్రతిపాదన పై ఓ స్టోరి.

కరోనా ఎఫెక్ట్​తో రాష్ట్రంలో మార్చి 16 నుంచి స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఇప్పటిదాకా ఫిజికల్ క్లాసులు స్టార్ట్ కాలేదు. ఈ విద్యా సంవత్సరం నష్టపోవద్దనే ఆలోచనతో సెప్టెంబర్ నుంచి డిజిటల్, ఆన్​లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. మొదట బతుకమ్మ, దసరా తర్వాత స్కూళ్లు, కాలేజీలు ప్రారంభించాలని సర్కారు భావించింది. కానీ కరోనా సెకండ్ వేవ్ ప్రమాదం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో వెనక్కి తగ్గింది. డిసెంబర్ ఫస్ట్​ వీక్​లో స్టార్ట్ చేయాలని విద్యాశాఖ ప్రతిపాదించినా సీఎం కేసీఆర్ ఒకే చెప్పకపోవడంతో వాయిదా పడ్డాయి.

అయితే కరోనా ఎఫెక్ట్​తో పది నెలలుగా మూసి ఉన్న స్కూళ్లు, కాలేజీలను తిరిగి ఓపెన్​ చేసేందుకు రాష్ట్ర సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. సంక్రాంతి పండుగ తర్వాత విద్యా సంస్థలన్నింటినీ తెరవాలని ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్ ప్రతిపాదనలు చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఫైనల్​ ఎగ్జామ్స్ ​నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ ప్రపోజల్స్​ సీఎం కేసీఆర్​ వద్దకు చేరాయి. మరోవైపు విద్యా సంస్థలను ఓపెన్​ చేస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. స్కూళ్లు, కాలేజీలు తెరవాలని ఆలోచన ఉన్నా తొమ్మిదో తరగతి పైబడిన విద్యార్దులకే తెరబోతున్నారు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు స్టూడెంట్లకు క్లాసులు, ఎగ్జామ్స్​ పై మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.

Tags:    

Similar News