Satyavathi Rathod: బీజేపీ మనిషి అవడం వల్లే ప్రధాని నుంచి ఫోన్ వచ్చింది
Satyavathi Rathod: షర్మిలపై విరుచుకుపడ్డ మంత్రి సత్యవతి రాథోడ్
Satyavathi Rathod: వార్డు సభ్యురాలు కూడా కాని వ్యక్తిని ప్రధాన మంత్రి పలకరించడం సిగ్గుచేటు అన్నారు గిరిజన ,స్త్రీ, శిశు..సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. ఇంత దిక్కుమాలిన రాజకీయం బీజేపీకే చెల్లిందని ఫైర్ అయ్యారు. సీఎంకు, ప్రజాప్రతినిధులకు అపాయింట్మెంట్ ఇవ్వని ప్రధాని.. షర్మిలతో ఫోన్లో మాట్లాడారంటేనే ఆమె బీజేపీ మనిషని అర్ధం చేసుకోవచ్చన్నారు మంత్రి. మహబూబాబాద్ జిల్లాలో త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనుండటంతో.. మెడికల్ కళాశాల నిర్మాణ పనులను మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు.