ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డి తన ఇంట్లో నిరవధిక దీక్ష కొనసాగిస్తున్నారు. నిన్నటి నుంచి ఆయన కొందరు మహిళ కార్మికులతో కలిసి దీక్ష చేస్తున్నారు. మరోనేత రాజిరెడ్డి ఇంటి వద్ద దీక్ష చేస్తున్నారు. ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించడంలేదన్నారు. నియంతృత్వ దోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తున్నారని విమర్శించారు.