ఆర్టీసీ జేఏసీ , అఖిలపక్ష నేతలు ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో సమావేశమయ్యారు. నిన్నటి చలో ట్యాంక్ బండ్ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. రేపు హైకోర్టులో వినిపించే వాదనలపై సమాలోచనలు జరుపుతున్నారు. జైల్ భరో, రోడ్ల దిగ్బంధం వంటి కార్యక్రమాలతో ఆందోళనలు మరింత ఉధృతం చేయాలని నేతలు భావిస్తున్నారు. సమావేశానికి టీజేఎస్ అధ్యక్షుడు కోదందరామ్, కాంగ్రెస్ నేతలు వీహెచ్, మల్లు భట్టి విక్రమార్క, సంపత్ కుమార్తో పాటు చాడ వెంకటరెడ్డి, బి. వెంకట్, విమలక్క, ఆర్టీసీ జేఏసీ నేతలు హాజరయ్యారు.