ఖమ్మంలో ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యాయత్నం

Update: 2019-10-12 12:51 GMT

ఖమ్మంలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన తీవ్రరూపం దాల్చింది. సమ్మెపై మనస్థాపం చెందిన శ్రీనివాస్‌రెడ్డి అనే డ్రైవర్‌ ఏకంగా ఆత్మహత్యాయత్నం చేశారు. ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో శ్రీనివాస్‌రెడ్డి శరీరం 90 శాతానికి పైగా కాలిపోయింది. వెంటనే సహచరులు అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే శ్రీనివాస్‌రెడ్డిని పరీక్షించిన వైద్యులు పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని తెలిపారు. 

Tags:    

Similar News