హైదరాబాద్‌లో దొంగల బీభత్సం.. 6 ఆఫీసుల్లో చోరీ, రూ.25 లక్షలు అపహరణ

హైదరాబాద్‌లో దొంగలు రెచ్చిపోయారు. బేగంపేట్‌ పీఎస్‌ పరిధిలో తాళాలు వేసి ఉన్న కార్యాలయాలను టార్గెట్‌గా చేసుకొని.. వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఆరు ఆఫీసుల్లోకి చొరబడి.. 26 లక్షల నగదు అపహరించుకుపోయారు

Update: 2020-12-13 07:58 GMT

హైదరాబాద్‌లో దొంగలు రెచ్చిపోయారు. బేగంపేట్‌ పీఎస్‌ పరిధిలో తాళాలు వేసి ఉన్న కార్యాలయాలను టార్గెట్‌గా చేసుకొని.. వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఆరు ఆఫీసుల్లోకి చొరబడి.. 26 లక్షల నగదు అపహరించుకుపోయారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ కెమెరాల్లో రికార్డయిన చోరీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు. పగటిపూట రెక్కీ నిర్వహించి.. రాత్రి సమయాల్లో దొంగతనాలకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags:    

Similar News