Quthbullapur: రహదారిపై డివైడర్‌ను ఢీకొన్న లారీ.. బియ్యం లోడుతో వె‎ళ్తుండగా ప్రమాదం

Quthbullapur: లారీ ఢీకొట్టడంతో విద్యుత్ లైట్ పోల్ ధ్వంసం

Update: 2023-09-02 05:20 GMT

Quthbullapur: రహదారిపై డివైడర్‌ను ఢీకొన్న లారీ.. బియ్యం లోడుతో వె‎ళ్తుండగా ప్రమాదం

Quthbullapur: కుత్బుల్లాపూర్‌లోని సూరారం కట్టమైసమ్మ దగ్గర ఓ లారీ బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి ప్రధాన రహదారిపై బోల్తా పడింది. బియ్యం లోడుతో వె‎ళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రహదారి మధ్యలో డివైడర్‌ను ఢీకొట్టి మధ్యలో నిలిచిపోయింది. లారీ ఢీకొట్టడంతో డివైడర్ సహా మధ్యలోని విద్యుత్ లైట్ పోల్ ధ్వంసమైంది. లారీలో నుంచి బియ్య బస్తాలు రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లారీ డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి.

Tags:    

Similar News