నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Nizamabad: లారీని ఢీ కొట్టిన కారు

Update: 2023-03-13 03:45 GMT

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి 

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇండల్వాయి మండలం చంద్రాయన్ పల్లి శివారులో అర్ధరాత్రి సమయంలో కారు లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలాన్నినిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్ పరిశీలించారు. మృతులు మహారాష్ట్ర లోని బిలోలికి చెందిన వారిగా గుర్తించారు. 

Tags:    

Similar News