సూర్యాపేట జిల్లాలోని చిలుకురు మండలం మిట్స్ కాలేజీ సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో- లారీ ఢీ కొన్న ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చిల్కూరు మండలం జాంపహాడ్లోని దర్గాను దర్శించుకొని ఓ కుటుంబం ఆటోలు తిరిగి వస్తుండగా చిల్కూరు మిట్స్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీ ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు గాయ పడ్డారు. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మృతులు మహబూబాబాద్ జిల్లా కురవి మండలం చింతపల్లి వాసులుగా గుర్తించారు.