నయీం కేసులో తన పేరు ఉద్దేశపూర్వకంగానే ఛార్జ్షీట్లో పెట్టారన్నారు ఆర్.కృష్ణయ్య. తనకూ నయీంకు ఎలాంటి సంబంధం లేదన్నారు. 45 ఏళ్ల నుంచి ఎన్నో ఉద్యమాలు చేస్తున్నానని, ప్రభుత్వంపై ఉద్యమాలు చేస్తున్నాను కాబట్టే తన పేరుని ఛార్జ్షీట్లో పెట్టారంటున్న ఆర్.కృష్ణయ్య చెప్పుకొచ్చారు. తాను సంపాదన కోసం ఉద్యమాలు చేయడం లేదని అన్నారు. తాను గతంలో కూడా చెప్పాను అని ఎలాంటి దందాలు, ఆర్ధిక వ్యావహరాల్లో కానీ సివిల్స్ లో కాని ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ప్రజల పక్షాన ప్రజాపోరాటలు చేస్తున్న నాపై ఛార్జ్షీట్ పేరు పెట్టడం చాలా దుర్మార్గం అని అన్నారు.
ఇది రాష్ట్రప్రజలందరూ కుడా గమనిస్తున్నరని చెప్పారు. నయీం ఎన్కౌంటర్ సమయంలో బయటపడ్డ డైరీని ఎందుకు బయటపెట్టడం లేదని ఆయన పోలీసులను ప్రశ్నించారు. టీఆర్ఎస్ ల ఉన్నవారిని, ఇతర పార్టీల ఉన్నవారి, ఎమ్మెల్యేలను, నాయకులను, మంత్రులు, ఐపిఎస్ ఆపీసర్లు.. అసలైన వారందరిని వదిలిపెట్టి నాంకి వాస్త్ పేర్లను పెట్టడం ఎంటి అని ప్రశ్నించారు. దీనిపై సిబిఐ చేత విచారణ జరిపించాలని కోరారు. నయీం కేసును సీబీఐకు అప్పగిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని కృష్ణయ్య వ్యాఖ్యానించారు.