మాధాపూర్‌లో క్యూనెట్ బాధితుడు ఆత్మహత్య

Update: 2019-07-31 06:22 GMT

క్యూనెట్ సంస్థ చేతిలో మోసపోయిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాకుళంకు చెందిన అరవింద్ హైదరాబాద్ లోని ఓ సంస్థలో సాఫ్ట్ వేర్ గా పని చేస్తున్నాడు. గతంలో అరవింద్ క్యూనెట్ లో 20 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ పలుమార్లు అడిగినా ఫలితం లేకపోవడంతో మాధాపూర్ లోని తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు అరవింద్. మల్టిలెవల్ మార్కెటింగ్ పేరుతో క్యూనెట్ సంస్థ మోసాలపై గతంలోనే పలు కేసులు నమోదయ్యాయి.   

Tags:    

Similar News