ఆ బైక్ను చూస్తేనే అతడి క్రూరత్వం అర్థమవుతుంది.. ప్రియాంక రేప్ అండ్ మర్డర్లో అతడిదే కీలక పాత్ర
ప్రియాంకారెడ్డి నిందితులకు పట్టుమని పాతికేళ్లు కూడా లేవు కానీ, అందరిదీ క్రూర స్వభావమే ప్రియాంకపై అత్యాచారం చేయడమే కాకుండా దారుణంగా చంపి, ఆ తర్వాత అత్యంత కిరాతకంగా పెట్రోల్ పోసి తగలబెట్టడం చూస్తుంటే వాళ్లలో ఎంతటి రాక్షసత్వం ఉందో అర్ధమవుతుంది. నలుగురు నిందితుల్లో ఏ3 నవీన్కుమార్ది మొదట్నుంచీ నేర స్వభావమేనని తేలింది, తన బైక్ను పుర్రె లాంటి డేంజర్ సింబల్స్తో నింపేయడమే కాకుండా సైలెన్సర్ తీసేసి, చెవులు పగిలే సౌండ్స్తో హల్చల్ చేసేవాడని గ్రామస్తులు చెబుతున్నారు.
ప్రియాంకారెడ్డి నిందితులు నలుగురూ మొదట్నుంచీ క్రూర స్వభావం కలిగిన వాళ్లుగా తేలింది. పట్టుమని పాతికేళ్ల వయసు దాటకపోయినప్పటికీ నిందితులందరూ అత్యంత క్రూరత్వాన్ని చూపించేవారని గ్రామస్తులు అంటున్నారు. నిందితులు నలుగురికి నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాగా, ఏ1 ఆరిఫ్ది జక్లేర్ గ్రామం కాగా ఏ2 శివ, ఏ3 నవీన్ కుమార్, ఏ4 చెన్నకేశలుది గుడిగండ్ల విలేజ్. అయతే, ఈ నలుగురిలో జొల్లు నవీన్ కుమార్కి క్రూర నేర స్వభావముందంటున్నారు గ్రామస్తులు. తన బైక్కి సైలెన్సర్ తీసేసి సౌండ్తో హల్చల్ చేసేవాడని చెబుతున్నారు. సాధారణ బైక్ను స్పోర్ట్స్ వెహికల్గా మార్చుకోవడమే కాకుండా, హెడ్లైట్ తీసేసి ఆ ప్లేస్లో పుర్రె గుర్తుతో డేంజర్ బొమ్మ వేసుకున్నాడు నవీన్. అలాగే, బైక్ నిండా డేంజర్ సింబల్స్, రాక్షస బొమ్మలు వేసుకోవడాన్ని చూస్తుంటే జొల్లు నవీన్ కుమార్ మనస్తత్వం ఏంటో ఎంతటి రాక్షసుడో ఈజీగా అర్ధమవుతుంది.
ఇక, ప్రియాంక రేప్ అండ్ మర్డర్లోనూ నవీన్దే కీలక పాత్రని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ప్రియాంక స్కూటీ పార్క్ చేయగానే ఆమెపై కన్నేసిన ఈ గ్యాంగ్లో నవీనే టైర్ పంక్చర్ ప్లాన్ వేసినట్లు సీపీ వెల్లడించారు. టైర్ పంక్చర్ చేస్తే ప్రియాంకను ట్రాప్ చేయొచ్చని మిగతా వాళ్లతో చెప్పిన నవీన్. ఆమె వెళ్లగానే టైర్లో గాలి తీసేశాడని, ఆ తర్వాత అందరూ కలిసి ప్రియాంకను ట్రాప్ చేసి హత్యాచారానికి పాల్పడ్డారని సైబరాబాద్ సీపీ సజ్జనార్ వివరించారు. పట్టుమని పాతికేళ్లు కూడా లేకుండానే ఇంత క్రూర స్వభావం రాక్షసత్వంతో అత్యంత దారుణంగా యువతిపై సామూహిక అత్యాచారం చేయడమే కాకుండా, పెట్రోల్ పోసి తగలబెట్టడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటి వాళ్లకు సమాజంలో బతికే హక్కు లేదని, ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు.