హైదరాబాద్ లోని జూపార్క్ వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. అనంతపురం నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు జూపార్కు వద్ద ప్రమాదానికి గురైంది. పదిహను మందికి గాయాలయ్యాయి. డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ఈ ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు గాయపడ్డవారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.