తెలంగాణలో ఇవాళ ప్రధాని మోడీ పర్యటన
Modi: బీజేపీ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం
Modi: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రాలను చుట్టేస్తున్నారు ప్రధాని మోడీ. ఇందులో భాగంగానే తెలంగాణలో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఇవాళ మరోసారి ఆయన రాష్ట్రానికి రానున్నారు. మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిని డీకే అరుణకు మద్దతుగా నారాయణపేట్లో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్లో హైదరాబాద్ చేరుకుంటారు.
ఇక సాయంత్రం ఎల్బీస్టేడియంలో హైదరాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులకు మద్దతుగా జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ప్రధాని పర్యటన సందర్భంగా ఎల్బీనగర్లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎల్బీస్టేడియం పరిసరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ట్రాపిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.