జమ్మూకశ్మీర్‌లో పోస్టు పెయిడ్‌ మొబైల్‌ సేవలు పునరుద్ధరణ

అధికరణ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ లో ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే అయితే. అంతే కాకుండా అక్కడ పోస్టుపెయిడ్ మొబైల్ సేవలు, ఇంటర్నెట్ సేవలు నిలివేశారు.

Update: 2019-10-14 08:46 GMT

అధికరణ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ లో ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే అయితే. అంతే కాకుండా అక్కడ పోస్టుపెయిడ్ మొబైల్ సేవలు, ఇంటర్నెట్ సేవలు నిలివేశారు. దాదాపు రెండు నెలల తర్వాత అక్కడ పోస్టుపెయిడ్ మొబైల్ సేవలు పునరుద్ధరించారు. ఆంక్షలు సడలింపులో భాగంగా నేటి నుంచి అన్ని నెట్ వర్క్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇంటర్నెట్ సదుపాయంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి.ఆగస్టు 17నుంచి గత నెల 4వ తేదీ వరకు ల్యాండ్ లైన్ సేవలను దశలవారిగా పునరుద్ధరించారు. తాజాగా పోస్టుపెయిడ్ ఫోన్లు అందుబాటులోకి రావడంతో 40లక్షల మొబైల్ ఫోన్లు వినియోగానికి రానున్నాయి. జమ్ముకశ్మీర్ కుస్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేస్తూ ఉభయ సభల్లో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అక్కడ పలు ఆంక్షలు విధించారు.



Tags:    

Similar News