Telangana Weather Update: తెలంగాణలో రెయిన్ అలర్ట్.. మూడు రోజులు వర్షాల హెచ్చరిక
Telangana Weather Update: తెలంగాణలో వాతావరణ మార్పు.. వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులతో వర్షాల అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Telangana Weather Update: తెలంగాణలో రెయిన్ అలర్ట్.. మూడు రోజులు వర్షాల హెచ్చరిక
Telangana Weather Update : తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మార్పు చెందింది. ఎండలు పెరుగుతాయని భావిస్తున్న సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఆకాశం మేఘావృతమై అకాల వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి మరాత్వాడ వరకు సగటు సముద్రమట్టం నుంచి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ఇదే సమయంలో గ్యాంగ్టిక్ వెస్ట్ బెంగాల్ నుంచి తూర్పు కోస్తా ఆంధ్ర తీరం వరకు ఒడిశా మీదుగా మరో ద్రోణి కూడా ఏర్పడినట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
ఇటీవల నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలోని తీవ్ర అల్పపీడన ప్రాంతం నుంచి మధ్య తమిళనాడు, అంతర్గత కర్ణాటక మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు కొనసాగిన ద్రోణి ప్రస్తుతం బలహీనపడినప్పటికీ, దాని ప్రభావంతో వచ్చే మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
ఈ రోజు, రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున రైతులు, గొర్రెల కాపరులు పొలాల్లో లేదా చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.