Ponguleti Srinivasa Reddy: మేడిగడ్డ నష్టాన్ని ఏజన్సీతో కట్టించాలి..

Ponguleti Srinivasa Reddy: మేడిగడ్డ ప్రాజెక్ట్​ గత ప్రభుత్వం నిర్మాణంలో రూల్స్​ పాటించనందుకే కుంగిపోయిందని మంత్రి పొంగులేటి అన్నారు.

Update: 2023-12-29 10:10 GMT

Ponguleti Srinivasa Reddy: మేడిగడ్డ నష్టాన్ని ఏజన్సీతో కట్టించాలి..

Ponguleti Srinivasa Reddy: మేడిగడ్డ ప్రాజెక్ట్​ గత ప్రభుత్వం నిర్మాణంలో రూల్స్​ పాటించనందుకే కుంగిపోయిందని మంత్రి పొంగులేటి అన్నారు. టాప్​ లాగ్​ గేట్స్​ పనిచేయకపోయినందుకే కుంగిపోయిందన్నారు. తన మార్కు కనిపించాలనే ఉద్దేశంతోనే మేడిగడ్డ బ్యారేజ్​ ను నిర్మించారన్నారు. ఈ ప్రాజెక్ట్​ ఖర్చు ప్రతి పైసా కూడా అప్పు చేసి గత ప్రభుత్వం ఖర్చు చేసిందని తెలిపారు. ఇప్పుడు ఆ సొమ్ముకు మార్కెట్​ రేటు కంటె 12 శాతం ఎక్కువ వడ్డీ కడుతున్నామ్నారు. లక్ష కోట్లతో 50 టీఎంసీలు ఎత్తిపోస్తున్నారున్నారు. మేడిగడ్డ నష్టాన్ని ఏజన్సీతో కట్టిస్తారా లేదా అని బీఆర్​ఎస్​ నేతలను ప్రశ్నించారు. గత ప్రభుత్వం ప్రజలపై ఎంత భారం పడుతుందో ఆలోచించలేదన్నారు. కాళేశ్వరం డ్యామేజ్ కావడం దురదృష్టకరమని తెలిపారు. లక్షల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టులకు బిల్డర్లదే బాధ్యత అని మంత్రి పొంగులేటి అన్నారు.

Tags:    

Similar News