శాంతి భ‌ద్ర‌త‌ల‌పై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌.. పాతబస్తీలో ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌..

Police Restrictions: హైదరాబాద్‌ పాతబస్తీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు.

Update: 2022-08-24 13:09 GMT

శాంతి భ‌ద్ర‌త‌ల‌పై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌.. పాతబస్తీలో ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌..

Police Restrictions: హైదరాబాద్‌ పాతబస్తీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఈస్ట్‌జోన్‌, సౌత్‌జోన్లలో దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు ఇచ్చారు. రాత్రి 7 గంటల నుంచి షాపులు మూసివేయాలని ప్రకటించారు. మరోవైపు పాతబస్తీలో ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ బలగాలు భారీగా మోహరించాయి. ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు ఆర్‌ఏఎఫ్‌ బలగాలు.

ఇంకోవైపు శాంతిభద్రతలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష కొనసాగుతోంది. ఈ స‌మావేశానికి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, హైద‌రాబాద్‌, సైబ‌రాబాద్‌, రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌రేట్ల సీపీలు సీవీ ఆనంద్, స్టీఫెన్ ర‌వీంద్ర‌, మ‌హేశ్ భ‌గ‌వ‌త్‌లో పాటు ప‌లువురు ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

Full View


Tags:    

Similar News