Hyderabad: మహేష్‌ బ్యాంక్‌ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం

Hyderabad: ఇప్పటికే ఓ మహిళతో పాటు ఇద్దరు నైజీరియన్లు అరెస్ట్‌

Update: 2022-02-02 06:05 GMT

 ఇప్పటికే ఓ మహిళతో పాటు ఇద్దరు నైజీరియన్లు అరెస్ట్‌

Hyderabad: హైదరాబాద్‌కు చెందిన మహేష్‌ బ్యాంక్‌ కేసులో సీసీఎస్‌ పోలీసుల దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే ఓ మహిళతో పాటు ఇద్దరు నైజీరియన్లు అరెస్ట్‌ చేసిన పోలీసులు.. మరో ఆరుగురి కోసం గాలిస్తున్నారు. ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో గాలింపు చేపట్టారు. పశ్చిమ బెంగాల్‌, త్రిపుర, మేఘాలయ, మణిపూర్‌, కేరళకు స్పెషల్‌ టీమ్స్‌‌ను పంపించారు. మహేష్‌ బ్యాంక్‌ స్కామ్‌లో ట్రాన్సాక్షన్‌ జరిగిన కొందరు ఖాతాదారులను అదపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే పక్కా ప్లాన్‌తోనే సూత్రదారులు ముందస్తుగా ఖాతాదారులను సిద్ధం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఖాతాదారుల నుండి నగదు తెచ్చేందుకు ప్రత్యేకంగా నైజీరియన్లను సూత్రదారులు నియమించుకున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News