ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రేవంత్ను అదుపులోకి తీసుకున్న తర్వాత వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పుతున్నారు. ముందుగా గోల్కొండ పీఎస్కు తీసుకెళ్లిన పోలీసులు ఆ తర్వాత నార్సింగి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం ఔటర్ రింగ్ రోడ్ మీదుగా మరో చోటికి తరలిస్తున్నారు. ప్రస్తుతం రేవంత్రెడ్డి ఔటర్ రింగ్ రోడ్ పై ఉన్నట్లు తెలుస్తోంది. సాయంత్రం ఐదు గంటల వరకు రేవంత్ రెడ్డిని ఓఆర్ఆర్పైనే తిప్పనున్నట్లు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.