Perni Nani: టీడీపీ మత్స్యకారుల సంక్షేమానికి చేసింది శూన్యం

Perni Nani: విశాఖ బోట్లలో అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందన్నారు పేర్ని నాని.

Update: 2023-11-25 13:45 GMT

Perni Nani: టీడీపీ మత్స్యకారుల సంక్షేమానికి చేసింది శూన్యం

Perni Nani: విశాఖ బోట్లలో అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందన్నారు పేర్ని నాని. ప్రమాదం జరిగిన మరుసటి రోజే మత్స్యకారులకు నష్ట పరిహారం అందించామని గుర్తుచేశారు. గత టీడీపీ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి చేసింది శూన్యమన్న పేర్నినాని..ఒక్క హార్బర్‌ కానీ..ఒక్క జెట్టీని గాని నిర్మించారా అంటూ టీడీపీని ప్రశ్నించారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు మాజీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు. చంద్రబాబుతో కలిసి తప్పుడు ప్రభుత్వాన్ని నడిపిన నువ్వా నీతులు చెప్పేది అంటూ మండిపడ్డారు. ఐదేళ్లలో తన అవసరాల కోసం చంద్రబాబు ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశాడో నీ కళ్లకు కనిపించలేదా పవన్ అంటూ ప్రశ్నించారు. 

Tags:    

Similar News