Harish Rao: ఒమిక్రాన్‌ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Harish Rao: తెలంగాణలో రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదు కావడంపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు మంత్రి హరీష్‌రావు.

Update: 2021-12-15 15:30 GMT

Harish Rao: ఒమిక్రాన్‌ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Harish Rao: తెలంగాణలో రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదు కావడంపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు మంత్రి హరీష్‌రావు. ప్రతిఒక్కరూ మాస్క్‌ ధరించాలని, కోవిడ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకోవాలని అన్నారు. సిద్దిపేట 27వ మున్సిపల్‌ వార్డు గణేష్‌ నగర్‌లో 15 లక్షల నిధులతో మహిళా సమాఖ్య భవనాన్ని ఆయన ప్రారంభించారు. కాంపౌండ్ వాల్, 6వ వార్డులో మహిళా భవనం మరమ్మత్తులకు అవసరమైన నిధులు సమకూర్చి 3 నెలల్లోపు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల మనస్సులో ఉన్నదాన్ని నెరవేర్చడమే తమ లక్ష్యమని చెప్పారు హరీష్‌రావు.

Tags:    

Similar News