ఆగస్టు 15 నుంచి పాదయాత్ర : కోమటిరెడ్డి వెంకట రెడ్డి

Update: 2019-07-21 15:39 GMT

భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనదైన శైలిలో అధికార పార్టీ టిఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఆగష్టు 15 న నార్కట్‌పల్లి నుండి జలసౌధ వరకు యాత్ర చేపడుతున్నాని తెలిపారు. నల్లగొండలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్‌కు హార్ట్‌ అయిన నల్లగొండ మున్సిపాలిటిలో ఈ సారి కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేయలని పట్టణ ప్రజలను కోరారు. తక్షణమే మున్సిపల్ శాఖ మంత్రిని నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపాలిటి ఎన్నికల్లో ఒటమి భయంతోనే.. పెంచిన పెన్షన్లను హడావిడిగా ఇస్తున్నారని ఎద్దేవ చేశారు కోమటిరెడ్డి వెంకట రెడ్డి

Tags:    

Similar News