NIMS Hospital: పంజాగుట్ట నిమ్స్​హాస్పిటల్ కు ఈ నెల 9న సెలవు

NIMS Hospital: సీఎం జగన్‌కు రాజీనామా లేఖను ఇచ్చిన వాసిరెడ్డి పద్మ

Update: 2024-03-07 06:23 GMT

NIMS Hospital: పంజాగుట్ట నిమ్స్​హాస్పిటల్ కు ఈ నెల 9న సెలవు

NIMS Hospital: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నోటిఫికేషన్ రాకుండానే ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ పదవికి రాజీనామా చేశారు. పార్టీ కోసం పనిచేయాలని భావిస్తున్నట్టు సీఎం జగన్‌కు పద్మ చెప్పినట్టు సమాచారం.

సీఎం జగన్‌కు అత్యంత నమ్మకమైన వైసీపీ నేతల్లో వాసిరెడ్డి పద్మ ఒకరు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆమెను మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా చేశారు. గతంలో ఆమె ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినప్పటికీ సమీకరణాలతో ఆమెకు టికెట్ దక్కలేదు. దీంతో ఈ పదవిని జగన్ అప్పగించారు. తాజాగా వాసిరెడ్డి పద్మరాజీనామాతో రాజకీయ ఊహాగానాలు ఊపందుకున్నాయి.‎

Tags:    

Similar News