కొనసాగుతున్న రీపోస్ట్మార్టం.. దిశ నిందితుల శరీరాల్లో బుల్లెట్ల విషయమై క్లారిటీ
దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్ట్మార్టం కొనసాగుతోంది. నిందితుల శరీరంలో ఉన్న బుల్లెట్ గాయాలను ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు. దీనిలో భాగంగా నిందితుల శరీరాల్లో ఉన్న బుల్లెట్లపై ఒక క్లారిటీ వచ్చింది. ఎవరెవరి శరీరంలో ఎన్నెన్ని బుల్లెట్లు ఉన్నాయో వైద్యులు గుర్తించారు. ఏ1- మహ్మద్ ఆరీఫ్ శరీరంలో నాలుగు బుల్లెట్ గాయాలు, ఏ-2 నిందితుడు జొల్లు శివ శరీరంలో ఒక బుల్లెట్ గాయం, ఏ-3 నవీన్ బాడీలో రెండు బుల్లెట్ గాయాలు, ఏ-4 చెన్న కేశవులు శరీరంలో మూడు బుల్లెట్ గాయాలున్నట్లు ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు.