ఆర్డీవో కార్యాలయంలో దారుణం.. వీఆర్ఏతో స్వీపర్ పనులు చేయిస్తున్న అధికారులు

RDO Office: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెవెన్యూ అధికారుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది.

Update: 2022-04-18 12:07 GMT

ఆర్డీవో కార్యాలయంలో దారుణం.. వీఆర్ఏతో స్వీపర్ పనులు చేయిస్తున్న అధికారులు

RDO Office: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెవెన్యూ అధికారుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. కొన్ని నెలల క్రితం ఏర్పాటు చేసిన వేములవాడ ఆర్డీవో కార్యాలయంలో హౌజ్ కీపింగ్ సిబ్బంది లేకపోవడంతో ఓ వీఆర్ఏ చేత క్లీన్ చేయిస్తున్నారు ఇక్కడి అధికారులు. భోయినిపల్లి మండల కేంద్రం వీఆర్ఏగా పనిచేస్తున్న ప్రశాంత్ ఉన్నతాధికారుల ఆదేశంతో ప్రతిరోజు ఉదయాన్ని వేములవాడ ఆఫీస్ క్లీన్ చేస్తూ విధులకు వెళ్తున్నారు.

ఆలస్యంగా వెలుగులోకొచ్చిన రెవెన్యూ అధికారుల నిర్వాకం జిల్లాలో వివాదాస్పదంగా మారింది. ఓ కిందిస్థామయి ఉద్యోగితో ఉన్నతస్థాయి అధికారులు ఇలాంటి పనలు చేయించడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే వేములవాడలో కొన్ని నెలల క్రితం ఏర్పాటు చేసిన ఆర్డీవో కార్యాలయంలో సిబ్బంది కొరతే కాదు వసతులు కూడా అంతంత మాత్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News