టీఆర్ఎస్ శ్రేణుల్లో కరోనా వైరస్ కలకలం రేపుతుంది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయనకు కోవిడ్–19 సోకినట్లు నిర్ధారణ అయింది. గత రెండు రోజులుగా సింటమ్స్ కనిపించడంతో టెస్ట్ చేయించుకున్న ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా.
ఇప్పటికే కరోనా పాజిటివ్ వచ్చిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తో కాంటాక్ట్ అయినా అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. ఒకే జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలకు పాజిటివ్ రావడంతో జిల్లా నేతల్లో కలవరం మొదలైంది. ఇప్పటికే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే జాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కరోనాతో హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నాడు. తెలంగాణలో వారం రోజుల వ్యవధిలో ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా వైరస్ బారినపడ్డారు.