సీఎం కేసీఆర్పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ధ్వజమెత్తారు. ఎంఐఎం పార్టీకి కేసీఆర్ చెంచాలా మారారని ఆరోపించారు. తెలంగాణలో టీఆర్ఎస్ను బొందపెడతామని అది చూడటానికి కేసీఆర్ నిండు నూరేళ్లు బతకాలని అరవింద్ ఆకాంక్షించారు. మరో పదేళ్లు తానే సీఎం అని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని అరవింద్ ఎద్దేవా చేశారు. ఏడాదిలోపే టీఆర్ఎస్ ప్రభుత్వ పతనం ఖాయమని పేర్కొన్నారు. చిదంబరానికి పట్టిన గతే కేసీఆర్కు పడుతుందని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు.