Bhainsa: పరమత సహనం కేవలం హిందూ ధర్మంలోనే ఉంటుంది - ఎంపీ అర్వింద్

Bhainsa: పరమత సహనం కేవలం హిందు ధర్మంలో మాత్రమే ఉంటుందన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్.

Update: 2021-03-09 10:49 GMT

పరమత సహనం కేవలం హిందూ ధర్మంలోనే ఉంటుంది - ఎంపీ అర్వింద్

Bhainsa: పరమత సహనం కేవలం హిందు ధర్మంలో మాత్రమే ఉంటుందన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. బైంసాలో పక్కా ప్రణాళికతో అల్లర్లు జరుగుతున్నాయని అన్నారు. బైంసాలో గట్టు మైసమ్మ ఆలయాన్ని కూల్చి తెలంగాణేతర ముస్లింలకు ఇల్లు కట్టించాలని కుట్ర జరుగుతుందని ఆరోపించారు. బైంసా అల్లర్లపై దృష్టి పెట్టాలని కేంద్రానికి లేఖ రాయనున్నట్లు అరవింద్ తెలిపారు. రాజకీయపార్టీలకు అతీతంగా భైంసా ఘటన పై స్పందించాలని సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News