NITI Aayog CEO: ఎంపీ సంతోష్‌ కుమార్‌కు నీతి ఆయోగ్‌ సీఈవో అభినందనలు

NITI Aayog CEO - Santosh Kumar: గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ లో భాగంగా తన నివాస ప్రాంగణంలో మొక్కలు నాటిన అమితాబ్‌ కాంత్‌

Update: 2021-09-26 14:00 GMT

ఎంపీ సంతోష్‌ కుమార్‌కు నీతి ఆయోగ్‌ సీఈవో అభినందనలు

NITI Aayog CEO - Santosh Kumar: ఎంపీ సంతోష్‌ కుమార్‌ను నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ అభినందించారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఓ ఉద్యమంలా కొనసాగుతుందని కొనియాడారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్ కాంత్‌ తన నివాస ప్రాంగణంలో మొక్కలు నాటారు.

అనంతరం ఆయనకు ఎంపీ సంతోష్‌కుమార్ వృక్ష వేదం పుస్తకాన్ని అందజేశారు. తాను కూడా మరో ముగ్గురిని హరిత సవాల్‌కి నామినేట్‌ చేస్తానని అన్నారు. ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News