చెత్తకుప్పలో పసికందు

Update: 2019-08-11 09:43 GMT

వికారాబాద్‌ జిల్లా బంటారంలో దారుణం జరిగింది. అప్పుడేపుట్టిన నవజాతశిశువుని చెత్తకుప్పలో పడేసిన ఘటన మండల కేంద్రంలో కలకలం రేపింది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి పసికందును చెత్తకుప్పలో పడేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే పసికందును గుర్తించిన అంగన్ వాడి టీచర్లు వెంటనే బిడ్డను బయటకు తీసి.. హుటాహుటిన చికిత్స నిమిత్తం తాండూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఆ పసికందు గొంతుపై బలంగా కొట్టినట్లు, తీవ్రంగా గాయపరిచినట్లు వైద్యులు వెల్లడించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ పసికందు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బిడ్డ పరిస్థితి విషయంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే ఎందుకు ఇలా చేశారు? ఎవరు చేశారని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News