నేడు తెలంగాణకు మరోసారి NDSA బృందం

Telangana: జలసౌధలో చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలో.. వివిధ విభాగాల అధిపతులు, నిపుణులతో భేటీ

Update: 2024-03-20 04:48 GMT

నేడు తెలంగాణకు మరోసారి NDSA బృందం

Telangana: కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలు, లోపాలపై అధ్యయనంతో పాటు సిఫార్సులకు, రెండోసారి విచారణ చేపట్టేందుకు జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ NDSA బృందం ఇవాళ హైదరాబాద్ నున్నది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఈ బృందం మూడు రోజుల పాటు జలసౌదలో వివిధ విభాగాల అధిపతులు, ఇంజినీర్లు, ఇతర నిపుణులతో భేటీ కానుంది. బ్యారేజీలకు సంబంధించి ప్లానింగ్, హైడ్రాలజీ, డీపీఆర్ రూపకల్పన-డిజైన్లు, నిర్మాణ దారులు, రాష్ట్ర డ్యాం సేఫ్టీ సంస్థ, రిటైర్డ్ ఇంజినీర్లతో కమిటీ విచారణ చేపట్టనున్నది. ఈనెల ఆరో తేదీన మొదటి సారిగా రాష్ట్రంలో పర్యటించిన NDSA బృందం పలు విషయాలపై అధ్యయనం చేసింది.

Tags:    

Similar News