కుటుంబ సభ్యులు, అభిమానుల కన్నీటి సంద్రం నడుమ మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. ముఖేష్ గౌడ్ పార్ధీవ దేహాన్ని కాసేపట్లో ఆయన స్వగృహం నుంచి గాంధీ భవన్కు తరలిస్తారు. ముఖేష్ గౌడ్ను కడసారి చూసేందుకు ఆయన అభిమానులు భారీగా తరలిరావడంతో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ముఖేష్ గౌడ్తో తమకున్న అనుబంధాన్ని తలుచుకుంటూ పార్టీ కార్యకర్తలు కన్నీరు పెట్టుకున్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా కార్యకర్తల సంక్షేమానికి పాటు పడ్డారంటూ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.