టీపీసీసీ పదవికి ఉత్తమ్ రాజీనామా!

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా కాంగ్రెస్ ఘోర ఓటమికి నైతిక భాద్యత వహిస్తూ టీపీసీసీ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు చోట్ల మాత్రమే విజయం సాధించింది.

Update: 2020-12-04 13:55 GMT

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా కాంగ్రెస్ ఘోర ఓటమికి నైతిక భాద్యత వహిస్తూ టీపీసీసీ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు చోట్ల మాత్రమే విజయం సాధించింది. కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తరవాత పీసీసీ భాద్యతలు చేపట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి దారుణంగా ఫెయిల్ అయ్యారు. అయన భాద్యతలు తీసుకున్న తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధించలేకపోయింది. 2016 GHMC ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఘోర ఓటమి పాలు అయింది. ఇక 2019 ఎంపీ ఎన్నికల్లో కేవలం మూడు సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన పంచాయితీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓడిపోగా, హుజూర్ నగర్, దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా సత్తా చాటలేకపోయింది. కాగా అటు డిసెంబర్ 09న కొత్త పీసీసీ చీఫ్ ని నియమించే అవకాశం ఉంది. 

Tags:    

Similar News