మొయినాబాద్ మండల పంచాయతీ అధికారిగా పనిచేస్తున్న ఉషాకిరణ్ను సస్పెండ్ చేస్తూ ఇంచార్జి కలెక్టర్ హరీష్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె మొయినాబాద్ మండల పంచాయతీ అధికారిగా పదోన్నతి పొందడానికి ముందు 2018–19లో ఇబ్రహీంపట్నం మండలం పోచారం పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. ఈ సమయంలోనే నిధుల దుర్వినియోగానికి ఆమె పాల్పడ్డారని తేలింది.
అంతేకాక పంచాయతీ పరిధిలో పన్నుల రూపంలో వసూలైన రూ.7.72 లక్షలను తన సొంత అవసరాలకు ఉపయోగించుకున్నట్లు తేలింది. అంతేకాకుండా తన బాధ్యతలను విస్మరించి అనధికార వెంచర్ల యాజమానులకు తాను సహకరించారనే ఆరోపణలు కూడా ఉషాకిరణ్పై వస్తున్నాయి. వెంచర్ యజమానుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ఇంచార్జి కలెక్టర్ ఆమెను శనివారం సస్పెండ్ చేశారు.