హుజుర్ నగర్ ఉపఎన్నికలో విజయం సాధించిన శానంపూడి సైదిరెడ్డీ.. ఇవాళ తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కలిశారు. సైదిరెడ్డితో పాటు.. మంత్రి జగదీష్రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు నంద్యాల దయాకర్రెడ్డి కూడా కవితను కలిశారు. ఈ సందర్భంగా సైదిరెడ్డిని కవిత అభినందించారు. గెలుపు కోసం శ్రమించిన ఇతర నాయకులను కూడా ఆమె ప్రశంసించారు.