తెలంగాణ సర్కార్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్‌ వార్నింగ్‌

Update: 2019-09-07 09:03 GMT

యాదాద్రి ఆలయంలో టీఆర్ఎస్ గుర్తు బొమ్మలను తొలగించనట్లయితే ఆందోళన చేపడతామని హెచ్చరించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే రాజా సింగ్ పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. యాదాద్రి స్తంభాలపై చెక్కిన కేసీఆర్, కారు బొమ్మలను వారం రోజుల్లో తొలగించనట్లయితే హిందూ వాదులతో కలిసి ఆందళన చేపడుతామన్నారు. సీఎం కేసీఆర్‌ యాదాద్రిని ప్రపంచస్థాయి క్షేత్రంగా చేయడాన్ని స్వాగతిస్తున్నామని, కానీ ఆయన బొమ్మలను వేయడం సరికాదన్నారు. రాష్ట్ర నాయకత్వంతో చర్చించి త్వరలోనే యాదాద్రిపై కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. భావితరాలకు తెలియజేయడానికి నాయకుల బొమ్మలను చెక్కితే, వారు చేసిన అవినీతిని కూడా చెక్కుతారా.? అని నిలదీశారు. 

Tags:    

Similar News