హుజూర్నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్కు పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్
మిషన్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ హుజూర్నగర్ ఉపఎన్నికలో అధికార పార్టీ టీఆర్ఎస్కే పట్టం కట్టింది.
మిషన్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ హుజూర్నగర్ ఉపఎన్నికలో అధికార పార్టీ టీఆర్ఎస్కే పట్టం కట్టింది. టీఆర్ఎస్ పార్టీకి 53 శాతం, కాంగ్రెస్ 41%, బీజేపీకి 1.1%, టీడీపీ 2.1 శాతం మంది మద్దతు ఉంటుందని ప్రకటించింది. కారు పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డికి రెండో స్థానం రావచ్చని విషన్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ తెలిపింది. హుజూర్ నగర్ ఎన్నికల్లో బీజేపీ నిరాశ తప్పదని ఆ సర్వే తెలిపింది.
ఇండియా టీవీ, టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ మహారాష్ట్రలో, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని స్పష్టం చేశాయి.