మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న మంత్రి తలసాని.. రాజగోపాల్ రెడ్డి స్వార్థంతోనే మునుగోడులో ఉప ఎన్నిక

Talasani Srinivas Yadav: ప్రభుత్వ పథకాలే టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తాయి

Update: 2022-10-16 10:31 GMT

మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న మంత్రి తలసాని.. రాజగోపాల్ రెడ్డి స్వార్థంతోనే మునుగోడులో ఉప ఎన్నిక

Talasani Srinivas Yadav: మునుగోడు అభివృద్ధి TRSతోనే సాధ్యమన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కొందరు నేతల స్వార్థపూరితమైన రాజకీయాలతో ఈ ఉప ఎన్నిక వచ్చిందన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యర్థి కూసుకుంట్లతో కలిసి నాంపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణలో అన్ని వర్గాలు, ప్రాంతాల అభివృద్ది జరుగుతోందన్నారు. అయితే బూర పార్టీ మారడంపై స్పందించిన తలసాని రాజకీయాల్లో ఇలాంటివి మామూలే అన్నారు.

Tags:    

Similar News