గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై మంత్రి సత్యవతి రాథోడ్ స్పందన

Satyavathi Rathod: బీజీపీ నేతలను కలిసి ప్రభుత్వంపై విమర్శలు చేయటడం సరికాదు

Update: 2022-04-08 11:30 GMT

గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై మంత్రి సత్యవతి రాథోడ్ స్పందన

Satyavathi Rathod: గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. బీజీపీ నేతలను కలిసి ప్రభుత్వంపై విమర్శలు చేయటడం సరికాదన్నారు. బీజేపీ కార్యకర్తమాదిరిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో అవమానం జరిగితే ఇక్కడే మాట్లాడాల్సి ఉంది. తాను తలుచుకుంటే ప్రభుత్వం కూలిపోతుందంటూ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. సీఎం కేసీఆర్ కు మహిళలు అంటే ఎంతో గౌరవంగా చూసుకుంటారని చెప్పారు. అత్యంత గౌరవంగా.. మర్యాదగా చూసుకునే సంస్కృతి ప్రభుత్వానిదన్నారు. రాష్ర్ట ప్రభుత్వాన్ని బెదిరించినట్టు మాట్లాడుతున్నారని అన్నారు.

Tags:    

Similar News