ఎంపీ సంతోష్ కుమార్ బర్త్డే..విషెస్ చెప్పిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణాన్ని కాపాడటానికి గ్రీన్ చాలెంజ్ అనే వినూత్నమైన పథకాన్ని ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణాన్ని కాపాడటానికి గ్రీన్ చాలెంజ్ అనే వినూత్నమైన పథకాన్ని ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈయన పుట్టిన రోజు సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సంతోష్ ప్రవేశ పెట్టిన ఈ పథకం ద్వారా రాష్ట్రలో మొక్కల శాతం పెరగుతుందని, దీంతో కాలుష్యం తగ్గుతుందని కేటీఆర్ ఆయన్ని కొనియాడారు.
అనంతరం కేటీఆర్ సంతోష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ విధంగా ట్విట్ చేశారు. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరింత కాలం ప్రజాసేవ చేయాలని ఆకాంక్షిస్తూ కేటీఆర్.. అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఈయనతోపాటు మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, రవీంద్ర కుమార్, దివాకర్ రావు, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్తో పాటు కల్వకుంట్ల విద్యాసాగర్రావు ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Many returns of the day to Hon'ble MP @MPsantoshtrs Garu who celebrates his birthday today 🌱
— KTR (@KTRTRS) December 7, 2019
Wishing you good health, happiness, peace and a long life in public service Santu 👍 pic.twitter.com/Gm5O4ruzl6