కారు ప్రమాదంపై స్పందించిన మంత్రి కేటీఆర్

Update: 2019-11-23 12:54 GMT
మంత్రి కేటీఆర్

నూతనంగా ప్రారంభించిన హైదరాబాద్ బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై జరిగిన ప్రమాదంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ఆయన తెలిపారు. ఈ ఫ్లైఓర్ పైన కేవలం 40 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించాలన్నారు. కానీ ప్రమాదం జరిగిన సమయంలో కారు 100 కిలోమీటర్ల వేగం వెళుతోందని ఆయన తెలిపారు. ఈ ఫ్లైఓవర్ పై 40 కిలోమీటర్ల వేగం మించకూడదని హెచ్చరిక బోర్డులు తెలుపుతున్నాయని కేటీఆర్ తెలిపారు.

ఈ ప్రమాదంలో ఓ మహిళ మరణించడం విషాదకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై విచారణ జరిపి ఫ్లైఓవర్ డిజైన్ లో ఏమైనా లోపాలున్నాయేమోనని పరిశీలిస్తామని తెలిపారు. ఏమైనా లోపాలున్నట్లయితే వాటిని మార్పులు చేస్తామని వారు తెలిపారు.



Tags:    

Similar News