ఇది నిజం కాకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తా.. బీజేపీ నేతలకు మంత్రి కేటీఆర్ సవాల్
KTR: ప్రధాని మోడీ ఒక్కరే వందల లక్షల కోట్లు అప్పు చేశారు
KTR: బీజేపీ నేతలకు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశామని బీజేపీ నేతలంటున్నారు.. 14 మంది ప్రధానులు 50లక్షల కోట్లు అప్పులు చేస్తే.. ప్రధాని మోడీ ఒక్కరే వందల లక్షల కోట్ల అప్పు చేశారన్నారు. వందల లక్షల కోట్లు ఏం చేశారంటే సమాధానం చెప్పడానికి బీజేపీ నేతలకు మొహం లేదన్నారు. ఇది నిజం కాకపోతే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్న ఆయన తన సవాల్ను బీజేపీ నేతలు స్వీకరించలేదని తెలిపారు.