Komati Reddy: రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదు

Komati Reddy: రైతులకు పంట నష్ట పరిహారం అందిస్తాం

Update: 2024-03-20 08:49 GMT

Komati Reddy: రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదు

Komati Reddy:  రైతుల్ని రైస్‌ మిల్లర్లు ఇబ్బందిపెడితే సహించేది లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మిర్యాల గూడలో పర్యటించిన మంత్రి రోడ్లపై వడ్లు ఆరబోసిన రైతులతో కాసేపు ముచ్చటించారు. రైస్ మిల్లర్లు సరైన ధర కల్పించకుండా ఇబ్బంది పెడుతున్నారని మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా సివిల్ సప్లై అధికారులతో మంత్రి కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా తక్షణం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులను ఇబ్బంది పెట్టే రైస్‌ మిల్లర్లపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.

Tags:    

Similar News