లాక్డౌన్ను విజయవంతంగా అమలు చేసేందుకు తెలంగాణ పోలీసులు ఎంతో శ్రమిస్తున్నారని మంత్రి హరీష్రావు వ్యాఖ్యానించారు. నిద్రాహారాలు మాని, వేళకు తిండి లేకుండా, అవస్థలు పడుతూ కూడా, విధి నిర్వహణలో అలక్ష్యం చూపడం లేదన్నారు.
ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన ఓ పోస్ట్ పెట్టారు. సరిహద్దుల్లో సైనికులు ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నారో చూడనివాళ్లు ఈ దృశ్యాలు చూస్తే చాలు. విధి నిర్వహణలో తెలంగాణ పోలీసులు యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి త్యాగాలకు మనం ఇవ్వగలిగిన గౌరవం, ఇంటిపట్టునే ఉండి లాక్డౌన్ను విజయవంతం చేయాలని ట్వీట్ చేశారు. వారికి శాల్యూట్ అని వ్యాఖ్యానించారు. ఇక ఈ ట్వీట్ పై రాష్ట్ర డీజీపీ మహీందర్ రెడ్డి స్పందించారు. తమ పోలీసుల కష్టాన్ని గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
సరిహద్దుల్లో సైనికులు మనకోసం ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నారో చూడనివాళ్లు ఈ దృశ్యాలు చూస్తే చాలు. విధి నిర్వహణలో మన తెలంగాణ పోలీసులు యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి త్యాగాలకు మనం ఇవ్వగలిగిన గౌరవం, ఇంటిపట్టునే ఉండి లాక్ డౌన్ ను విజయవంతం చేయడం. వారికి నా శాల్యూట్! pic.twitter.com/m81aIe8ZYN
— Harish Rao Thanneeru #StayHome #StaySafe (@trsharish) April 7, 2020