Etela Rajender: గాంధీ ఆస్పత్రి అక్రమాలపై ప్రభుత్వం ఆగ్రహం.. కాసేపట్లో మంత్రి ఈటెల రివ్యూ మీటింగ్ !

Update: 2020-02-15 04:43 GMT
గాంధీ ఆస్పత్రి అక్రమాలపై ప్రభుత్వం ఆగ్రహం.. కాసేపట్లో మంత్రి ఈటెల రివ్యూ మీటింగ్ !

గాంధీలో జరుగుతున్న అక్రమాలపై వైద్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీలో జరుగుతున్న అక్రమాలపై ఆరా తీశారు. అలాగే డాక్టర్ వసంత్ చేస్తున్న ఆరోపణలపై ఆరా తీసిన ఆయన అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంఈ, సూపరింటెండెంట్ పై వస్తున్న ఆరపణలపై ఆయన వివరణ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ మంత్రి ఈటెల రాజేందర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ లో ఉన్నతాధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించనున్నారు.

గాంధీ ఆస్పత్రిలో జరుగుతున్న అక్రమాలపై గత కొద్దిరోజులుగా హెచ్ ఎంటీవీ వరుసగా కథనాలను ప్రసారం చేస్తోంది. డాక్టర్ వసంత్ చేస్తున్న ఆరోపణలు ఆయనపై సూపరింటెండెంట్‌ చేసిన ప్రత్యారోపణలు ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఎప్పటికప్పుడు ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో నిన్న గాంధీ ఆస్పత్రిలో మీడియాపై ఆంక్షలు విధించడం కలకలం రేపింది. ఈ వ్యవహారాల నేపథ్యంలో గాంధీలో అక్రమాలపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. కాసేపట్లో మంత్రి ఈటెల సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. 

Tags:    

Similar News