అమీర్ పేట్ లో నిలిచిపోయిన మెట్రో రైలు
♦ పెద్దశబ్దంతో ఆగిపోయిన మెట్రో రైలు ♦ భయాందోళనలో ప్రయాణీకులు
హైదరాబాద్ లోని అమీర్ పేట్, బేగంపేట మెట్రో స్టేషన్ల మధ్య మెట్రో రైలు నిలిచిపోయింది. పెద్దశబ్దంతో మెట్రో రైలు ఆగడంతో ప్రయాణీకులు భయాందోళకు గురయ్యారు. ట్రాక్ పై మంటలు కూడా వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, భారీ శబ్దం రావడానికి కారణాలు ఏమిటని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు.